ప్రభుత్వ పాఠశాలలో పాము హల్ చల్.
September 22, 2022
0
మంచిర్యాల జిల్లా:- నెన్నెల మండలంలోని కోనంపేట గ్రామంలో గల ప్రభుత్వ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో గురువారం ఉదయం పాము హల్ చల్ చేస్తూ భయాందోళనకు గురిచేసింది. రోజూ వారీగా పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాము ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామస్తులను పిలిపించి పామును పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ దొరకపోగా, వారి మీదికి బుసలు కొడుతూ పైకి రావడంతో భయంతో పామును చంపేశారు.

.jpeg)