DIGITAL MANCHERIAL NEWS:- అదిలాబాద్ జిల్లాలో శనివారం మిషన్ భగీరథ ట్యాంకులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కుబీర్ మండలంలో డోడార్నా తండా 5 కు చెందిన జాదవ్ సాయబ్ రావు (24) అనే వ్యక్తి మతి స్టమితం కోల్పోయి తిరిగేవాడని ట్యాంకు వద్ద స్నానానికి వెళ్లి ప్రమాద వశాత్తు జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు ఏఎస్ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

