DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం రిలీఫ్ పండ్ల పథకం నిరుపేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తుందని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన... మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద విడుదలైన లక్ష రూపాయల చెక్కును బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తికి చెందిన నివాసి రాజేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని... రానున్న ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన తెలిపారు.


