DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని కాసిపేట 2 గని కి మొదటి సారిగా వచ్చిన కాసిపేట గ్రూప్ ఏజెంట్ రాందాస్ ని గ్రూప్ ఇంజనీర్ రాంప్రసాద్ ని ఘనంగా సన్మానించిన కాసిపేట 2 గని అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికులు. అనంతరం గని ఆవరణలో కోత్తగా వచ్చిన గ్రూప్ ఏజెంట్ రాందాస్, గ్రూప్ ఇంజనీర్ రాంప్రసాద్, మేనేజర్ లక్ష్మీనారాయణ కలసి మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ లక్ష్మీనారాయణ, సెఫ్టీ ఆఫీసర్ సంతోష్ రావు, ఇంజనీర్ రఘు, నందకీషోర్, సర్వేయర్ ప్రకాశ్, అండర్ మేనేజర్ లు శ్యాంసుందర్, కృష్ణప్రసాద్, టిబిజికెయస్ ఫిట్ సెక్రటరీ కారుకురి తిరుపతి, టిబిజికెయస్ సీనియర్ నాయకులు ఎట్టం కిషన్, చల్లా సదానందం, మరియు తదితరులు పాల్గొన్నారు.

