DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం వచ్చిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కి కటిక దుకాణాల దగ్గర జంక్షన్ ఏర్పాటు కోరకు స్థానికంగా ఉండే ప్రజలు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు కి వినతిపత్రం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దివాకర్ రావు త్వరలోనే జంక్షన్ ఏర్పాటు చేస్తామని స్థానిక ప్రజలకి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజమౌళి, వెంకటేష్, రాజ్ కుమార్, బొడ్డు లచ్చన్న, రాజస్వామి, కొండపర్తి మొగిలి తదితరులు పాల్గొన్నారు.

