DIGITAL MANCHERIAL NEWS:-
మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలంలోని సమీపాన గల గోదావరి నదిలో మృతదేహం లబ్దం.వివరాల్లోకి వెళితే... కోటపల్లి మండలంలోని కొల్లూరు గ్రామ సమీపంలోని గోదావరి నదిలో రెండు రోజులుగా గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుండగా ప్రవాహంలో శనివారం గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చింది. దానిని గమనించిన స్థానికులు సమీపంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతుని యొక్క వివరాలు సేకరిస్తున్నారు. ఎవరికైనా మృతుని యొక్క సంబంధిత వివరాలు తెలిసి ఉంటే... 8712656556, 8712656555 నంబర్లకు సమాచారం అందించాలని స్థానిక ఎస్సై సురేష్ తెలిపారు.

