వివరాల్లోకి వెళితే... నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సుమారుగా 140 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన రైతులకు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతుల మీదగా టార్పలిన్ కవర్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, మన దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు ఒక మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని అన్నారు. అలాగే రానున్న ఎన్నికలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు నాంది పలుకుతుందని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కేవీకే ఇంఛార్జ్ రాజేశ్వర్ నాయక్, జెండా వెంకటపూర్ గ్రామ సర్పంచ్ వై లక్ష్మి మోహన్, ఇతర ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



