Breaking News:- తాండూర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్.

D Prashanth Netha
0
DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని తాండూర్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.


తాండూరు ఎస్సైగా విధులు నిర్వహించిన కిరణ్ కుమార్ హజీపూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ కావడంతో నెన్నెల ఎస్సైగా ఉన్న ప్రసాద్ తాండూరు ఎస్సైగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రసాద్ మాట్లాడుతూ... మండల శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. జూదం, గాంజా తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్సై కి శుభాకాంక్షలు తెలిపారు.
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by