మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి పట్టణనికి చెందిన యువతిని మోసం చేసిన కేసులో ఉపసర్పంచ్ కి జైలు శిక్ష. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి కాంట్రాక్టర్ బస్తీకి చెందిన ఒక యువతిని 15 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని, లగ్నపత్రిక సైతం రాయించుకొని తనను మోసం చేశాడని యువతి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పిర్యాదు మేరకు సోమగూడెం గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్ ఆరేపల్లి ప్రవీణ్ పై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి కోర్టులో హాజరు పరిచి, అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జైలుకు తీసుకువెళ్లారు.

