మంచిర్యాల జిల్లా:- జైపూర్ మండలంలోని గంగిపెల్లి గ్రామానికి చెందిన ఐదేండ్ల చిన్నారిపై అత్యాచారం. వివరాల్లోకి వెళితే అదే గ్రామానికి చెందిన ఎనగందుల శివప్రసాద్ అనే వ్యక్తి వారి ఇంటికి సమీపంలో ఉండే చిన్నారిని ఇంటికి తీసుకొచ్చి ఐదు రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో, చిన్నారిని వారి తల్లిదండ్రులు అడగగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతని పై శుక్రవారం ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

.jpeg)