మంచిర్యాల జిల్లా:- నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో గ్రామ రక్షణ కోసం ఏర్పాటు చేసిన సిసి కెమెరాల డేటా మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండడంతో గ్రామంలో ఎటువంటి దొంగతనాలు, గొడవలు, సంఘటనలు జరిగినా గ్రామంలోని ప్రజలకు చూపించడం లేదు. తమ అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు. వెంటనే సీసీ కెమెరా డేటాను గ్రామ పంచాయతీ కార్యాలయంకు అనుసంధానం చెయ్యాలని గ్రామ పంచాయతీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

