బెల్లంపల్లి నియోజకవర్గం:- నాసిరకం పంట మందులు విక్రయిస్తే యజమానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన మోర్ల జనార్దన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి కల్పనకు లిఖితపూర్వకంగా ఆయన ఫిర్యాదు చేశారు. అమాయకమైన రైతులను చూసి అటువంటివారికి నాసిరకం మందులను అంట పడుతున్నారని ఆరోపించారు.

