మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి పట్టణంలోని షంషేర్ నగర్కు చెందిన పుల్లం దివాకర్(22) అనే యువకుడు గత కొన్ని రోజులుగా మండీ హోటల్ లో ప్రారంభించి నిర్వహిస్తున్నారు. హోటల్ ప్రారంభించినప్పటి నుండి నష్టాల పాలు కావడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణ ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంతోష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.

