మద్యానికి బానిసై వ్యక్తి మృతి...!
October 28, 2022
0
మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి పట్టణంలో మద్యానికి బానిసై, వదిలేయడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ధరంపూర్ కు చెందిన రాజ్వీర్ (35) బెల్లంపల్లిలోని ఓ కాంట్రాక్టర్ వద్ద కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే భార్య వదిలేసి విడాకులు ఇచ్చిందని మనస్థాపం చెంది విపరీతంగా మద్యానికి బానిసైన శుక్రవారం రైలు కిందపడి మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.

