DIGITAL MANCHERIAL NEWS:- మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా గట్టుపల్ మండలంలోని తేరట్ పల్లి గ్రామంలో బుధవారం 2, 3, 6వ వార్డుల్లో స్థానిక B(T)RS పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించి బెల్లంపల్లి ఎమ్మెల్యే, B(T)RS పార్టీ ఎన్నికల ఇంచార్జి దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... చేనేత వస్తువులపై విధించిన జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని అలానే గ్రామంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి వివరించి మునుగోడు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే రానున్న మునుగోడు ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా B(T)RS పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు బెల్లంపల్లి నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.



