మంచిర్యాల జిల్లా:- బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎంసెట్, ఐసెట్ కౌన్సిలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని అభ్యర్థులు మరియు తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్ జరిగే ప్రదేశంలో కనీసం.... టాయిలెట్స్ లేకపోవడంతో మహిళలు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అలాగే టెంట్, కుర్చీల సౌకర్య లేకపోవడంతో అభ్యర్థులు,వారి తల్లిదండ్రులు చెట్లకింద కాలక్షేపం చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

