DIGITAL MANCHERIAL:- మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా గట్టుపల్ మండలం శేరుగూడెం గ్రామంలో స్థానిక TRS ( BRS ) పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... ప్రభుత్వ, TRS ( BRS ) పార్టీ సంక్షేమ పథకాలను, గ్రామంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి వివరించి మునుగోడు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే రానున్న మునుగోడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా TRS ( BRS ) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండల వైస్ ఎంపీపీ విక్రమ్, కోమటిచెను సర్పంచ్ శ్రీనివాస్, బెల్లంపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు అశోక్ గౌడ్, రమేష్, కో ఆప్షన్ సభ్యుడు వెంకటేష్, నియోజకవర్గ TRS ( BRS ) నాయకులు భీమాగౌడ్ , శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



