మంచిర్యాల జిల్లా:- చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాంగ్రెస్ పార్టీ నుండి తన సొంత గూటికి తెరాస లోకి వచ్చారు. ఆయన తో పాటు ఆయన సతీమణి మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి కూడా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఇదే సంవత్సరం మే 19న కాంగ్రెస్ లో చేరగా, పార్టీ లో తనకు గుర్తింపు లేకపోవడంతో అలాగే జిల్లా నాయకుల వేధింపులు తట్టుకోలేక తిరిగి తెరాస కండువా కప్పుకున్నారు. ఈరోజు అధికారికంగా ప్రగతి భవన్ లో KTR సమక్షంలో నల్లాల ఓదెలు మరియు భాగ్యలక్ష్మి తెరాస పార్టీ లో చేరారు.




