DIGITAL MANCHERIAL:- తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 16న మంచిర్యాల జిల్లాలో జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు బయోమెట్రిక్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రెండు గంటల ముందే తమ పరీక్ష సెంటర్లకు హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. ఈ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... 8: 30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామమని, 10. 15 తర్వాత వచ్చే అభ్యర్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అలాగే హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉంటే గెజిటెడ్ సంతకం తప్పనిసరి అని, అలాగే అన్ని పరీక్ష కేంద్రాలు సీసీ కెమెరా ఆధ్వర్యంలో ఉంటాయని తెలిపారు.

