DIGITAL MANCHERIAL:- తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2022-23 సంవత్సరానికి గాను మిగిలిన సీట్ల భర్తీకి ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐటీఐ జిల్లా కన్వీనర్ ఎం. చందర్ తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణులైన వారు ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 13 నుంచి 17 వరకు http: ///iti. telangana. gov. in వెబ్సైట్లో లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి మెమో ఆధారంగానే వివరాలు నమోదు చేసుకోవాలని, ఇదివరకే నమోదు చేసుకున్న వారు ఉంటే వెబ్ ఆప్షన్ లో పెట్టుకుంటే సరిపోతుందని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే మీ దగ్గరలో గల ప్రభుత్వ ఐటిఐ కళాశాల లో సంప్రదించాలని తెలిపారు.

.png)