ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు.
October 22, 2022
0
మంచిర్యాల జిల్లా:- జిల్లా కేంద్రంలోని రాముని చెరువు కట్టపై శనివారం ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొమురం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జల్, జంగల్, జమీన్ కోసం నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, సింగరేణి విశ్రాంత కార్మికులు పాల్గొన్నారు.

