మంచిర్యాల జిల్లా:- మందమర్రి పట్టణంలోని మూడో జోన్ లో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు. వివరాల్లోకి వెళితే... మందమర్రి పట్టణంలోని మూడో జోన్ లోని D-204 క్వాటర్ లో దొంగల దోచేశారు. కే కే 5 గని లో జనరల్ మాజ్ఞుర్ గా విధులు నిర్వహిస్తున్న కార్మికుడు రాజకుమార్, అతని భార్య వారి పిల్లలకు టిఫిన్ ఇవ్వడానికి స్కూల్ కి తిరిగి వచ్చి చూసేసరికి బీరువా పగలగొట్టి ఉండడంతో వెంటనే దొంగతనం జరిగిందన్న విషయం గ్రహించి పోలీసులకు తెలియజేయడంతో సంఘటన స్థలికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, క్లూస్ టిమ్ తో సేకరించి ఆధారాలు దర్యాప్తు చేస్తామన్నారు.

