DIGITAL MANCHERIAL:- మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా మునుగోడు గ్రామపంచాయతీ కమిటీతో రెండో రోజు కాంగ్రెస్ అభ్యర్థి తరపున బెల్లంపల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, చాకేపల్లి ఎంపీటీసీ ముడిమడుగుల మహేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ గెలుపు లక్ష్యంగా మాజీ ఎమ్మెల్సీ ఏఐసిసి సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


