మంచిర్యాల జిల్లా:- తాండూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బెజ్జాల గ్రామానికి చెందిన మడావి సుకుమార్ (22) శనివారం సాయంత్రం పిడుగుపాటుకు మృతి చెందాడు. ఇన్ని రోజులుగా అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఒకేసారి మరణించడంతో కుటుంబ సభ్యులు బంధు మిత్రులు అందరూ దుఃఖంతో రోదిస్తూ ఉన్నారు.

