ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి.
October 01, 2022
0
మంచిర్యాల జిల్లా:- తాండూర్ మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం. వివరాల్లోకి వెళితే తిరుపతి అనే వ్యక్తి కుటుంబ సభ్యుల తో కలిసి ఆటోలో దసరా పండుగ సందర్భంగా కొత్త దుస్తులు కొనేందుకు మంచిర్యాలకు వెళ్తుండగా బోయపల్లి గేట్ దగ్గర ఎదురుగా వస్తున్న బులోరా ఆటో ని ఢీ కొట్టడంతో ఆటో నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలైన ఆయన భార్యను బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తికి ఇద్దరు పిల్లలు కలరు. స్థానిక స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.


