DIGITAL MANCHERIAL:- తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే కేవలం షర్మిల అక్కతోనే సాధ్యమని వైఎస్ఆర్ టీపి మంచిర్యాల జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కల్పన జాగాటి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తాండూరు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.... వైయస్సార్ టిపి పార్టీ పేదల పక్షాన ప్రతిక్షణం పోరాడుతుందని రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ విభాగం ప్రధానకార్యదర్శి సుంకరి రాజేశ్వరి, బెల్లంపల్లి నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూప, తాండూర్ మండలం మహిళా అధ్యక్షురాలు MD. పర్వీనా సుల్తానా, బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి MD సర్వర్, లక్ష్మి, బేగం, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

