DIGITAL MANCHERIAL:- మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా మంగళవారం ఆమె మునుగోడు మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో ఇల్లిల్లూ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కావున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించగలరని కోరారు.

