DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ కార్యాలయం పక్కన గల కాలి స్థలంలో రాత్రికి రాత్రి మామిడి చెట్లు వెలిశాయి. సోమవారం రాత్రికి రాత్రే ఎవరో భూమిని కబ్జా చేసి గుంతలు తవ్వి మామిడి చెట్లను పెట్టారు. భూమి స్థలంలో హైకోర్టులో కేసు ఉన్నదని బోర్డు పెట్టినప్పటికీ కబ్జాదారులు కన్నేశారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


