మంచిర్యాల జిల్లా:- కడుపునొప్పి తట్టుకోలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... సుందరశాల గ్రామానికి చెందిన సుస్మిత(25) అనే మహిళ 3నెలల నుంచి కడుపు నొప్పితో బాధపడుతుండగా, వైద్యం చేసుకున్న కూడా ఎటువంటి మార్పు రాకపోవడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకి ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెల్లిందని సీఐ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.

