మంచిర్యాల జిల్లా:- దండేపల్లి మండలం లోని కొర్విచెల్మ గ్రామంలో మహిళపై అడవి పంది దాడి. వివరాల్లోకి వెళితే.... కొర్విచెల్మ గ్రామానికి చెందిన కొండగొర్ల రాజవ్వ అనే మహిళా పత్తి చేనులో పత్తి తీయిచుండగా, పత్తి చేనులో ఉన్న అడవి పంది ఒకేసారిగా మహిళపై దాడి చేసింది. తీవ్ర గాయాలు పాలైన రాజవ్వ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు వచ్చి అడవి పందిని తరిమికొట్టారు. అనంతరం తీవ్ర గాయాలైన మహిళను 108కు ఫోన్ చేసి చికిత్స నిమిత్తం మంచిర్యాల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

.jpeg)