మంచిర్యాల జిల్లా:- మామ ముందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... కాసిపేట మండలంలోని గోండుగూడ గ్రామంలో రమ్య (20) అనే మహిళ ను మామ వంట చేయమని మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన ఆమె భర్త 108కి ఫోన్ చేసి అంబులెన్స్ లో మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

