రేషన్ బియ్యాన్ని పట్టుకున్న అదనపు కలెక్టర్.

D Prashanth Netha
0
మంచిర్యాల జిల్లా:- జైపూర్ మండల పరిసర ప్రాంతంలో నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్. ఈ సందర్భంగా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న ఆటోని సీల్ చేసి, అధికారులకు అప్పగించారు. అనంతరం... అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.... నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




Post a Comment

0 Comments
Post a Comment (0)

Made with Love by