మంచిర్యాల జిల్లా:- మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టివాడ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి. వివరాల్లోకి వెళితే... బుధవారం రాత్రి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. వ్యక్తి యొక్క వయసు దాదాపు 50 సంవత్సరాల వరకు ఉంటాయని స్థానికులు అంటున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనానికి వచ్చి విచారణ చేపడుతున్నారు. ఎవరికైనా మృతుని వివరాలు తెలిస్తే 8712656534, 8712656535 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.


