మంచిర్యాల జిల్లా:- చెన్నూరు నియోజకవర్గం లోని కోటపల్లి మండలంలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఎస్ఈ శేషారావు రాథోడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు విద్యుత్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే రిపేర్లకు వచ్చే ట్రాన్స్ఫారాలను త్వరగా రిపేర్లు చేసి పంపియ్యాలని ఎస్ఈ శేషారావు రాథోడ్ కు ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య దరఖాస్తు అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో భారీ ఎత్తున రైతులు పాల్గొన్నారు.

