DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా లోని మందమర్రి మండలంలోని RKP.OC.ఏరియాలో శనివారం సాయంత్రం రహదారిపై ఓ పులి నడుస్తూ వెళ్లింది. గోదావరిఖని వైపు వెళ్తున్న వాహనదారులు రోడ్డు దాటుతున్న పులిని చూసి భయాందోళనకు గురయ్యారు. తమ ఫోన్లలో బంధించి షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. సంబంధిత అధికారులు అప్రమత్తమై వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వాహనదారులు ప్రజలు కోరుకుంటున్నారు.


