మంచిర్యాల జిల్లా:- మంచిర్యాల పట్టణంలోని రాళ్లపేట మజీద్ వెనకాల రాళ్ళవాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే... పట్టణంలో ఇనుప సామాను, ప్లాస్టిక్ కవర్లు అమ్ముతూ జీవనం సాగించే వ్యక్తి. అయితే అవసరం నిమిత్తం వాగు దాటే సమయంలో ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.

