DIGITAL MANCHERIAL NEWS:- అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని స్కూల్లోకి అనుమతించని ఘటన మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ లో సాయితేజ అనే పదవ తరగతి విద్యార్థి అయ్యప్ప మాల వేసుకున్న సందర్భంలో... అవే దుస్తులతో బుధవారం పాఠశాలకు రాగా... స్కూల్ యూనిఫామ్ ఏసుకొని వస్తేనే క్లాసులోకి అనుమతిస్తామని చెప్పి బయటకి పంపియడంతో వివాదానికి దారితీస్తుంది.

