DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో తన ఇంటి పక్కన స్థలాన్ని వదిలిపెట్టాలని లేదంటే తనను రేప్ చేసి, చంపేస్తానని కౌన్సిలర్ భర్త బెదిరిస్తున్నాడని బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పట్టణంలోని 16వ వార్డుకు చెందిన ఎండీ కరిష్మా తన తల్లి షరిఫాతో కలిసి కాలనీలో ఉంటుంది. అయితే స్థలం విషయంలో అదే వార్డు కౌన్సిలర్ భర్త వేధిస్తున్నాడని.. తల్లితో కలిసి గోడు వెల్లబోసుకుంది. ఈ రోజు కొంతమంది తనపై దాడిచేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

