DIGITAL MANCHERIAL NEWS:- నిరుపేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో అండగా నిలుస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని 16వ వార్డ్ కు చెందిన కళ్యాణ్ దాస్ కుమార్తె సహస్ర మరియు కుమారుడు మహావీర్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్న విషయాన్ని తెలుసుకొని వారి చికిత్స నిమిత్తం కుమార్తె సహస్ర కు 3,00,000 రూపాయలు మరియు కుమారుడు మహావీర్ కు 3,00,000 రూపాయల LOC మంజూరు చేయించి వారి కుటుంబసభ్యులకు అందచేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు BRS నాయకులు ఎలిగేటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

