DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని భీమిని మండలం వెంకటాపూర్ లోని గొల్లగూడ ప్రైమరీ పాఠశాలలో 50 మంది పిల్లలు ఉన్నప్పటికీ ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉండడంతో పిల్లలకు సరియైన విద్య అందడం లేదని, మరో ఉపాధ్యాయుడిని నియమించాలని సోమిశెట్టి రాజేష్ అనే గ్రామ యువకుడు ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన కేటీఆర్ ఉపాధ్యాయుడిని నియమిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.


