DIGITAL MANCHERIAL NEWS:- ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తీన్మార్ మల్లన్న సోమవారం బెల్లంపల్లి పట్టణంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ముందుగా కాంటా చౌరస్తా లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని, తమపై ఇప్పటివరకు 51 కేసులు పెట్టారని మల్లన్న తెలిపారు. అయినా ఎవరికి భయపడేది లేదని, అలానే పనిచేయని నాయకున్ని పదవి నుండి దించేందుకు రీ కాల్ సిస్టం అమలు చేయాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.


