DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని భీమారం మండలంలో కరెంట్ షాక్ తో ప్రవేట్ స్కూల్ డ్రైవర్ మృతి. వివరాల్లోకి వెళితే... కమ్మరిపల్లి గ్రామానికి చెందిన దుంపటి మల్లయ్య (48) అనే వ్యక్తి భీమారం మండల కేంద్రంలో గుడ్ మార్నింగ్ గ్రామర్ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ గా చేస్తున్నాడు. అయితే రోజువారిగా పార్కింగ్ స్థలం నుండి బస్సు తీయడానికి వెళ్లిన క్రమంలో అనుకోకుండా ఒక్కసారిగా కరెంటు తీగలు తెగిపడి మృతి చెందాడు. ప్రమాదమునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


