DIGITAL MANCHERIAL NEWS:- భీమిని మండలంలోని వెంకటాపూర్ గ్రామ గొల్లగూడ ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులకు ఒకే ఉపాద్యాయుడు ఉన్నారని, మరొకరిని నియమించాలని స్థానిక యువకుడు సొమిషెట్టి రాజేష్ గత వారం కేటీఆర్ కి ట్వీట్ చేయగా... వెంటనే స్పందించిన కేటీఆర్ విద్యాశాఖ అధికారులకు తెలుపగా వారం రోజుల గడవకముందే పాఠశాలకు కొత్త ఉపాద్యాయుడు నియమించడం జరిగింది. ఇందుకుగాను వెంటనే స్పందించిన కేటీఆర్ కి విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.


