DIGITAL MANCHERIAL NEWS:- భారతీయ జనత పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ పాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండలానికి చెందిన బిజెపి మండల ఇంచార్జ్ అట్కపురం రమేష్ ని శాలువాతో సన్మానించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... రానున్న ఎన్నికలలో బిజెపి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

