DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలంలో ఉరి వేసుకుని సింగరేణి కార్మికుడు మృతి. వివరాల్లోకి వెళితే... చెన్నూర్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో నివసించే తోట అరుణ్ అనే సింగరేణి ఉద్యోగి సంకారం గ్రామ సమీపంలోని మామిడి తోటలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

