DIGITAL MANCHERIAL NEWS:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉండాలని ఉద్దేశంతో ప్రారంభించిన పథకంలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం మరియు రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గల అర్హత గల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించడం జరుగుతుందని జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... అర్హత గల కుటుంబ సభ్యులు డిసెంబర్ 8వ తారీకులోగా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని చేసుకోవాలని సూచించారు.

