DIGITAL MANCHERIAL NEWS:- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 31 డిసెంబరు 2021న 50కి పైగా ప్రమాదాలు జరిగాయి. ఇందులో ద్విచక్రవాహనాలపై అపరిమిత వేగంతో వెళ్లి అదుపు తప్పినవే అధికంగా ఉన్నాయి. అసలే కొత్త సంవత్సరం వేడుకలు.. కొందరు మద్యం మత్తులో వాహనాలపై విన్యాసం చేస్తుంటారు. ఈ క్రమంలో వారు పడిపోవడమో, ఇతరులకు ఢీకొనడమో జరుగుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ముందస్తు జాగ్రత్తలు చెప్పాలని, వాహనాలు ఇవ్వవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

