DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లా మందమర్రి పరిధిలో ఏర్పాటుచేసిన టోల్ గేట్ వద్ద నిన్న రాత్రి సమయంలో 108 అంబులెన్స్, విఐపి వాహనాలకు దారి ఇవ్వకపోగా ప్రశ్నించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో టోల్ గేట్ సిబ్బంది దురుసుగా మాట్లాడుతూ... ఇష్టానుసారంగా సమాధానం ఇవ్వడంతో టోల్ గేట్ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా టోల్ గేట్ ప్రారంభించినప్పటి నుంచి స్థానిక వాహన దారులపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా టోల్ గేట్ రుసుము కట్టినప్పటికీ రసీదులు ఇవ్వకపోవడం జరుగుతుంది. రోడ్డు పనులు నిర్మాణం పూర్తి కాకముందే టోల్ ఎలా వసూలు చేస్తారని టోల్ గేట్ ప్రారంభమైనప్పటి నుండి వాహనదారుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

