DIGITAL MANCHERIAL NEWS:- కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి వసతులపై ఆరా తీసి మెను ప్రకారం నాణ్యమైన భోజనాన్ని, విద్యను అందించాలని ఆదేశించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, సర్పంచ్లు తిరుమల అనంత్ రావు, జంగు, ఎంపీటీసీ రామ్ చందర్, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, మండల బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, గ్రామ బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మల్లేష్, రైతుబంధు సమితి అధ్యక్షుడు రాందాస్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

