DIGITAL MANCHERIAL NEWS:- మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలంలో బాలుడు పై పిచ్చి కుక్కల దాడి చేసిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. దాడికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. మందమర్రిలోని స్థానిక ఫిల్టర్ బెడ్ ఏరియాకు చెందిన రెండేళ్ల బాలుడి తలపై పిచ్చికుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....కుక్కల సమస్యను పరిష్కరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసిన అధికారులు పట్టించుకోలేదని కాలనీవాసులు అంటున్నారు.


